ఇటీవలి కాలంలో స్వదేశంలో జరుగుతున్న సిరీస్ లలో టీమిండియా తిరుగు లేదు అన్న విధంగా అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి ఎవరైనా సరే అద్భుతంగా రాణిస్తూ క్లీన్స్వీప్ చేస్తూ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇటీవల వెస్టిండీస్తో స్వదేశం వేదికగా జరిగిన  వన్డే టి20 సిరీస్ లో అటు ప్రత్యర్థి వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేసి పూర్తి ఆధిపత్యం సాధించింది టీమిండియా. ఇక శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ చేసింది. మొదట ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.


 ఈ క్రమంలోనే 3వ టి20 మ్యాచ్ లో అయినా సరే గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక జట్టు అనుకుంది. కానీ ఊహించని రీతిలో అద్భుతంగా రాణించిన టీమిండియా ప్రత్యర్థి శ్రీలంక జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా రాణించింది అనే చెప్పాలి. ఇక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. దీంతో ఇక మొదట లంక జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది శ్రీలంక జట్టు.  ఇక 147 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన టీమిండియా అద్భుతంగా రాణించింది అని చెప్పాలి.


 మరో 19 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ప్రస్తుతం టీమిండియా పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అయితే యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 45 బంతుల్లో 73 పరుగులు చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఇక టీమిండియా విజయం ఎంతో సునాయాసంగా మారిపోయింది అని చెప్పాలి.  మరోవైపు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 15 బంతుల్లో 22 పరుగులు చేసి సహకారం అందించాడు. ఇక మొదటి సారి భారత టీ20 లో బ్యాటింగ్ చేసిన దీపక్ హుడా 16 బంతుల్లో 21 పరుగులు చేసి పరవాలేదు అనిపించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: