ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంటుంది. ఈ క్రమం లోనే లీగ్ మ్యాచ్ లు ముగింపు దశకు రావడంతో ఐపీఎల్ పోరు మరింత రసవత్తరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  ఇక ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతుంది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో తెలియదు అన్నంతగా ఉత్కంఠగా అన్ని జట్లు హోరాహోరీగా పోరాటాన్ని సాగిస్తూ ఉండడం గమనార్హం. కాగా 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇటీవలే లక్నో గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన గుజరాత్ జట్టు ప్లే అప్ కి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.


 దీంతో మిగతా మూడు స్థానాల్లో నిలిచేందుకు ఓటు అన్ని జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి. కాగా నేడు మరో ఆసక్తికర మ్యాచ్ జరగబోతోంది. రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాగా గతంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగగా రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. చివరిలో నో బాల్ విషయంలో వివాదం కూడా తెరమీదికి వచ్చింది అన్న విషయం తెలిసిందే. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడవ స్థానంలో కొనసాగుతోంది. అదేసమయంలో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని క్యాపిటల్స్ జట్టు ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉండటం  గమనార్హం. దీంతో విజయంతో తమ ప్లే  ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఇరు జట్లు కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయని చెప్పాలి. కాగా ముంబైలోని డివై పాటిల్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అన్నదానిపై ప్రస్తుతం ఎన్నో ఊహాగానాలు కూడా తెరమీదికి వస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: