కానీ ప్రస్తుతం మాత్రం భారత జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో ప్రతిష్ఠాత్మకమైన టెస్టు మ్యాచ్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. గతేడాది కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన టెస్ట్ మ్యాచ్ జులై ఒకటో తేదీ నుంచి ఆడేందుకు రీషెడ్యూల్ చేశారు. ఈ క్రమంలోనే ఇక ఈ టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. ఇటీవలే ఈ టెస్టు మ్యాచ్లో భాగంగా అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజా సెంచరీతో అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. అతను సెంచరీ పై రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత వెలుపల అదికూడా ఇంగ్లాండ్లో సెంచరీ చేయడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఒక క్రికెటర్గా ఇది ఎంతో గొప్ప విషయం అంటూ రవీంద్ర జడేజా తెలిపాడు. స్వింగ్ కి అనుకూలించే ప్రత్యర్థి గడ్డపైన ఇక ఈ శతకాన్ని సాధించడం ఆత్మవిశ్వాస ప్రేరకంగా భావిస్తున్నాను అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ పిచ్లపై శరీరానికి దగ్గరగా బంతిని ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ కవర్ డ్రైవ్ స్క్వెర్ డ్రైవ్ కు ప్రయత్నిస్తే ఇక బంతి బ్యాట్ అంచును తాకి వికెట్-కీపర్ లేదా స్లిప్ ఫీల్డర్ల చేతిలో పడే అవకాశం ఉంటుంది. అందుకే తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆఫ్ స్టంప్ లను వదిలేయాలని దృష్టి పెట్టాను. నాకంటూ ఒక పేరు పెట్టుకోకుండా జట్టుకు అవసరమైనప్పుడు ఏదైనా అంటూ చెప్పుకొచ్చాడు.