
ఎందుకంటే చిన్న కారణానికే సమస్యల్లో అండగా నిలవాల్సిన స్నేహితుడే చివరికి ప్రాణాలు తీసేసాడు. ఈ ఘటన ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సిటీకి చెందిన కఫ్తాన్ సింగ్ అనే 27 ఏళ్ల యువకుడు, సుహేల్ ఖాన్ ఇద్దరు కూడా స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇద్దరు ప్రాణ స్నేహితులుగా బ్రతికేవారు. ఇక వీరిద్దరికీ కూడా సిగరెట్ తాగే అలవాటు ఉంది. సాధారణంగా స్నేహితులు సిగరెట్ తాగుతున్నప్పుడు షేర్ చేసుకోవడం చూస్తూ ఉంటాం.
ఇక ఎప్పటిలాగానే ఈ ఇద్దరు స్నేహితులు కూడా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే ఒక కోట వద్దకు చేరుకుని ఇక అక్కడ తాగడం మొదలుపెట్టారు. అయితే సుహేల్ ఖాన్ కఫ్తాన్ సింగ్ ను సిగరెట్ ఇవ్వాలంటూ అడిగాడు. కానీ అతను మాత్రం ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇక వీరిద్దరి మధ్య మాట పెరిగింది. దీంతో ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపంతో ఊగిపోయిన సుహేల్ ఖాన్ విచక్షణ మరచిపోయి స్నేహితుడైన కప్తాన్ సింగ్ ను కోట మీద నుంచి తోసేసాడు. 30 అడుగుల ఎత్తున కోట మీద నుంచి కింద పడిపోవడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే గాయపడిన కఫ్తాన్ సింగ్ను ఆసుపత్రికి తరలించారు. చివరికి చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. దీనిపై ఇక మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.