ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఒక మ్యాచ్లో భారీ అంచనాల మధ్య బలులోకి దిగుతూ గెలుస్తుంది అనుకుంటే ఓడిపోతుంది. ఇక ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్లో మాత్రం గెలుస్తూ సత్తా చాటుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తో చెలరేగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ లోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.



 తొలి మ్యాచ్లో ముంబై పై గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆ తర్వాత రెండు మ్యాచ్లలో పరాజయం పాలైంది. అయితే తొలి రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ మూడో మ్యాచ్లో మాత్రం విజయం సాధించింది. అంతేకాదు ఐపీఎల్ హిస్టరీలో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. ఐపీఎల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోవడం రోహిత్ కు ఇది 19వ సారి అని చెప్పాలి. ఇక ఇన్నిసార్లు ఐపీఎల్ హిస్టరీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి దక్కలేదు. అయితే ఈ మ్యాచ్ తర్వాత రవి శాస్త్రి రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ జట్టు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక అతను చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.



 రోహిత్ శర్మ పూర్తిగా ఒత్తిడి గ్రహించాడని.. ఇలాగే ఆడితే ముంబై ఇండియన్స్ కు తిరుగుండదు అంటూ రవి శాస్త్రి  కామెంట్ చేసాడు. డిల్లిపై ఇక రోహిత్ శర్మ ముందుండి జట్టును నడిపించాడని.. రాబోయే మ్యాచ్ లలో ప్రత్యర్థులకు ఇది ఒక వార్నింగ్ అని రవి శాస్త్రి హెచ్చరిక జారీ చేసాడు. ముంబై ఇండియన్స్ ఒకసారి గెలవడం మొదలు పెడితే తర్వాత మ్యాచ్ లలో బలమైన విజయాలను సాధిస్తుంది అంటూ రవి శాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు. ఇకపోతే ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించడం ద్వారా తన స్థానాన్ని పాయింట్ల పట్టికలో మెరుగుపరుచుకుంది అని చెప్పాలి. ప్రస్తుతం ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది ముంబై ఇండియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: