మిగతా యువ ప్లేయర్లతో పోల్చి చూస్తే అందరికంటే ఎంతో వేగంగా భారత క్రికెట్ లోకి దూసుకు వచ్చిన యువ సంచలనం పృథ్వి షా మొదటి టెస్ట్ ఫార్మాట్లోకి అరంగేట్రం  చేసి మెరుపు వేగంతో సెంచరీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే పరిమిత ఓవర్ల ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు అని చెప్పాలి. అయితే 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో ఆడిలైట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.



 అక్కడి నుంచి పృథ్వి షా కెరియర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది అని చెప్పాలి. బిస్మిన్ టెస్ట్ సమయానికి టీంలో అరడజనుకు పైగా సీనియర్ ప్లేయర్లు గాయాలతో తప్పుకున్నప్పటికీ పృథ్వి షాకు టీం మేనేజ్మెంట్ మాత్రం పట్టించుకోలేదు. జట్టులోకి తీసుకోలేదు. ఇక వన్డే టి20 లోనూ ఒకటి అర ఛాన్సులు మాత్రమే దక్కించుకున్నాడు.  ఇక తర్వాత ఐపీఎల్ లో రాణించి అతని సెలెక్ట్ చేయకపోవడంపై సెలెక్టరుపై విమర్శలు వచ్చేలా చేసాడు. కానీ ఇప్పుడు 2023 ఐపీఎల్ సీజన్లో మాత్రం దారుణమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.


 వరుస పరాజయాలు చవిచూసిన ఢిల్లీ జట్టు ఇటీవల కోల్కతా జట్టుపై బోనీ కొట్టింది. అటు ఓపెనర్ గా బరిలోకి ఎదుగుతున్న పృథ్వి షా ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. మ్యాచ్లో రెండుసార్లు డక్ అవుట్ అవ్వగా.. మిగతా మ్యాచ్ లలో కనీసం 20 పరుగులు కూడా చేయలేక అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఒకవేళ పృథ్వి షా ఇదే ఆట తీరు కొనసాగిస్తే వచ్చే ఐపీఎల్ కి ఢిల్లీ అతని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పృథ్వి షా తో కలిసి అండర్ 19 ఆడిన శుభమన్ గిల్ ఇప్పుడు టీమ్ ఇండియా టెస్టులు, వన్డేలో టి20 లో ఆడుతున్నాడు. కానీ పృథ్వి షా ఇంకా ఐపీఎల్ లో ఆడేందుకే కష్టపడుతున్నాడు. అయితే పృథ్వి షా ఫెయిల్యూర్ కి కెప్టెన్సీ ఇవ్వలేదని కోపమే కారణం అని కొంతమంది చర్చించుకుంటున్నారు. పంత్ గాయపడిన తర్వాత పృథ్వి షాకు కెప్టెన్సీ వస్తుందని ఆశపడ్డాడు. కానీ కెప్టెన్సీ దక్కకపోవడంతో ఇలా ఆడుతున్నాడని  కొంతమంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl