
అయితే కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మాత్రం మొదట్లోనే తడబడింది అని చెప్పాలి. 151 పరుగులు మాత్రమే చేసి కీలకమైన ఐదు వికెట్లను కోల్పోయింది టీమిండియా. ఈ క్రమంలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పాలి. ఇలాంటి ప్రదర్శన చేస్తే అటు టీమిండియా గెలవడం కష్టమే అంటూ ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయ పెడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో టీమిండియా సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించ లేక పోయింది అంటూ భారత మాజీ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు.
ఇలా సానుకూల దృక్పథం లేకపోవడం కారణంగానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. జట్టు రక్షణాత్మక ధోరణి పట్ల అతను నిరాశ వ్యక్తం చేశాడు. టాస్ గెలిచినా భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అలాగే బౌలింగ్లో నలుగురు ఫేసర్లు, ఒక స్పిన్నర్లతో టీమిండియా బరులోకి దిగింది. ఒకవేళ సానుకూల దృక్పధం ఉండి ఉంటే కచ్చితంగా మొదట బ్యాటింగ్ చేయాల్సిందే. తొలి సెషన్ లో జాగ్రత్తగా ఆడి ఆపై మొదటి రోజు 250 పరుగులు చేసిన బాగుండేది. ఇప్పుడు ఆస్ట్రేలియా అదే పై చేయి. భారత్ తిరిగి పోటీలోకి రావాలన్న అది ప్రత్యర్థి మీదే ఆధారపడి ఉంది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు గొప్పగా బ్యాటింగ్ చేశారు. తొలిరోజు అద్భుతంగా పట్టు సాధించారు అంటూ రవి శాస్త్రి పేర్కొన్నాడు.