ఈరోజుల్లో అమ్మాయిలపై దాడులు ఎంతలా జరుగుతున్నాయంటే గతంలో ఎప్పుడు మహిళలపై ఇలాంటి, ఇన్ని దాడులు జరగలేదు. సామాన్యులే అంటే సెలెబ్రిటీలు ఆడవారిని చిన్న చూపు చూసి వారి మాట వినకుంటే వారిని ఏం చేయడానికైనా సిద్ధమనేలా చేస్తున్నారు. తాజాగా ఓ సీరియల్ హీరో తమ అప్పు తీర్చమని అడిగిన ఇద్దరు వ్యాపార స్త్రీలను బెదిరించి వారిపై దాడికి తెగబడ్డాడు.. అయినా మాట వినలేదని వారిని లైంగి కంగా వేధించాడు.. ఈ మేరకు ఈ సీరియల్ నటుడిపై కేసు నమోదు అయ్యింది.

కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్‌ అలియాస్‌ అమర్‌ శశాంక్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో బోటిక్ నిర్వహిస్తున్న ఇద్దరు అమ్మాయిలు కేసు నమోదు చేశారు. తాగిన మత్తులో మణికొండలో ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి పాల్పడ్డాడనే ఆరోపణపై పోలీసులు సమీర్ పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే మణికొండ లో బోటిక్ నిర్వహిస్తున్న విద్య, అపర్ణ అనే ఇద్దరు అమ్మా యిలు అమర్ కు ఐదు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. వాటిని చెల్లించాల‌ని మ‌హిళ‌లు ఒత్తిడి చేయ‌డంతో అమర్ భుదవారం రాత్రి 9 గంటలకు తమ ఇంటికి వచ్చి దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు

అమర్‌తో పాటు మరో ముగ్గురు, అతని గర్ల్‌ ఫ్రెండ్‌ స్వాతి తమపై దౌర్జన్యం చేసినట్లు శ్రీవిద్య, అపర్ణ అనే యువతులు ఫిర్యాదు చేసారు. అమర్, స్వాతిల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నడంతో మహిళలకి రక్షణ ఇచ్చిన పోలీసులు.. అమర్‌పై కేసు నమోదు చేశారు. ఈ వివాదంపై స్పందించిన అమర్ నాపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతుంది. నిజ నిజాలు ఏంట‌ని తెలుసు కోకుండా మాట్లాడుతున్నారు. అన్ని విష‌యాలు పోలీసుల ముందు చెబుతా. ఎవరికి సంజాయిషీ ఇచ్చుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు అని స‌మీర్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: