తెలుగు టీవీ సీరియల్స్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న నటుడు రాజేష్ దత్త.. తెలుగులోని పలు పాపులర్ సీరియల్స్ లో నటించిన ఆయన భార్య ఉండగానే ఇతరమ్మాయిలతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని మోసం చేస్తున్నాడని ఆయన భార్య మరియు ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు .. వదినమ్మ, చంద్రలేఖ వంటి మంచి సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేస్తున్న రాజేష్ గతంలో కర్తవ్యం, సుందరకాండ, మొగలిరేకులు, చక్రవాకం, రాధాకళ్యాణం, యువ ఇలా సుమారు 28 సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు..
తనకు పెళ్లి కాలేదని చెప్తూ అమ్మాయిలతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమె భార్య అతని పై ఆరోపణలు చేస్తుంది.. 2015 లో మా ఇద్దరికీ వివాహం జరిగిందని చెబుతూ, కొంతకాలం మా వివాహ జీవితం బాగానే ఉందని ఎప్పుడైతే ఇలాంటి విషయాలు చేస్తున్నాడని తెలిసి నిలదీశానో అప్పటినుంచి ఇద్దరికీ గొడవలు అవుతున్నాయి అని ఆమె వెల్లడించింది.. తనను నిలదీసినందుకు చివరకు కట్టుబట్టలతో ఇంట్లోనుండి గెంటివేశాడని రాజేష్ భార్య సాధన ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాధన ఆమె తల్లిదండ్రులు కలిసి జగద్గిరి గుట్ట పోలీసులను ఆశ్రయించి రాజేష్పై ఫిర్యాదు చేశారు. రాజేష్ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తనకు న్యాయం కావాలని సాధన డిమాండ్ చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి