బుల్లితెరపై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బిగ్ బాస్ సీజన్ 5 త్వరలో రానుంది. అయితే ఇందులో  కంటెస్టెంట్స్ లను సెలెక్ట్ చేయడంతో పాటు కావలసిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 గురించి కొంత మంది చెబుతున్న సమాచారం ప్రకారం మేరకు  సెప్టెంబర్ 5న మొదలు పెడతారని సమాచారం. అయితే ఈ  బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లుగా ఎవరెవరిని ఎంపిక చేశారో ఇప్పుడు  ఒకసారి చూద్దాం.

1). టిక్ టాక్ స్టార్ దుర్గారావు:టిక్ టాక్ ద్వారా తన వీడియోలను షేర్ చేస్తూ బాగా పాపులర్ సంపాదించాడు దుర్గారావు. అంతేకాకుండా ఈయన పలు షో లలో ఎంట్రీ కూడా ఇచ్చాడు.

2). యాంకర్ వర్షినీ:పలు సినిమాలో అతిథి పాత్ర చేసి, బుల్లితెర మీద కూడా  ఢీ, పటాస్-2 వంటి ప్రోగ్రాంలో యాంకర్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

3). యాంకర్ శివ:ఈ పేరు తెలియని వారు ఇప్పుడు ఎవరు ఉండరు. ఎందుకంటే మొన్న జరిగిన జబర్దస్త్ షో లో అనసూయని ఒక ప్రశ్న అడిగి అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా ఇతను సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్వూలు చేస్తుంటాడు.

4). శేఖర్ మాస్టర్:కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి శేఖర్ మాస్టర్. ఈయన పలు షో లకు  జడ్జిగా కూడా వహిస్తున్నాడు.

5). హైపర్ ఆది:తనదైన శైలితో పంచులతో అందరినీ ఎంతగానో అలరిస్తున్న వ్యక్తి ఆది. ఈయన పలు సినిమాలలో కూడా కమెడియన్ గా నటించాడు.

6). సింగర్ మంగ్లీ:తనదైన శైలిలో జానపద గేయాలను పాడుతూ , అందరినీ ఎంతగానో అలరిస్తుంటుంది మంగ్లీ.

7). జబర్దస్త్ వర్ష:ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ లో ఇమ్మాన్యూయెల్, వర్ష జోడీ ఒక మంచి ఇమేజ్ ను  సంపాదించుకున్నారు.

8). సురేఖ వాణి:ఈమె లేడీ కమెడియన్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది.


ఇక అంతే కాకుండా కమెడియన్ ప్రవీణ్, వరంగల్ వందన, న్యూస్ యాంకర్ ప్రత్యూష, టిక్ టాక్ స్టార్ భాను, ఫన్ బకెట్ భార్గవ, సీనియర్ నటి ప్రియా, మరో సీనియర్ నటి యమునా వీరి పేర్లు బిగ్ బాస్ 5  లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: