నిజం చెప్పాలంటే బుల్లితెరపై ఏ ప్రోగ్రామ్ అయినా సరే.. అది ఎక్స్ ట్రా జబర్దస్త్ అయినా.. జబర్దస్త్ అయినా.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయినా.. ప్రైవేట్ ఈవెంట్ అయినా.. ఫెస్టివల్ ఈవెంట్ అయినా.. ఇలా ఏదైనా సరే మంచి టిఆర్పి రేటింగ్ ని సాధించాలంటే ఒకే ఒక్క జోడి ఆ షో లో మెరవాల్సిందే.ఆ జోడీ ఏదో కాదు సుధీర్ రష్మీ జంట. బహుశా ఈ జోడి లేకుంటే ఆ ఈవెంట్ పెద్దగా సక్సెస్ అవ్వదేమో.. ఈ జోడి స్టేజిపై కనువిందు చేయకపోతే ఖచ్చితంగా వెలితి కనిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ప్రేక్షకులు ,అభిమానులతో పాటు సినీ నటులు కూడా కోరుకుంటున్నారు అంటే ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాధగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..


అంతేకాదు వీరిద్దరూ పరిచయమై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ, వీరి ప్రేమ ఎప్పటికప్పుడు సరికొత్త గానే చూపిస్తూ ఉంటారు షో నిర్వాహకులు..  కానీ ఎప్పుడూ కూడా స్టేజి పైన మితి మించి ప్రవర్తించలేదని చెప్పవచ్చు. ఇకపోతే వీరిద్దరూ చచ్చినా  పెళ్లి చేసుకోరు అంటూ ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ సతీష్ చెబుతున్నాడు.. అంతేకాదు రష్మీ కి  ఎప్పుడో పెళ్లి అయిపోయింది అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఉంది.


సతీష్ ఎవరో కాదు ఎక్కువగా ముక్కు అవినాష్ , చమ్మక్ చంద్ర టీం లలో చేస్తూ ఉంటాడు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. నిజంగా సుధీర్, రష్మి జోడి మధ్య ఏది లేదు.. వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు రొమాన్స్ సృష్టించి ,2 ఆర్ ఆర్  వేయగానే అది ప్రజల్లోకి వెళ్లిపోయి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే భ్రమ కలిగిస్తున్నారు. మొన్నామధ్య నేను వైజాగ్ వెళ్ళినప్పుడు.. ఒక అభిమాని నా దగ్గరికి వచ్చి భయ్యా సుధీర్ రష్మి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ..అని అడిగాడు.. దీంతో నేను వారు ఎప్పటికీ పెళ్లి చేసుకోరు.. వాళ్ళు ఎదో  బతుకు తెరువు కోసం షోలో చేస్తున్నారు.ఇక షో నిర్వాహకులు టిఆర్పి కోసం, లాభాల కోసం వీరిద్దరి మధ్య ఏదో ఉందని సృష్టిస్తున్నారు.. వాళ్ళు కేవలం బతకడం కోసమే ఇలా చేస్తున్నారని, చచ్చిపోయే వరకు కూడా పెళ్లి చేసుకోరు అంటూ ఘాటుగా స్పందించాడు సతీష్.


మరింత సమాచారం తెలుసుకోండి: