యాంకర్ గా , నటి గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా అడపాదడపా సినిమాలు చేస్తూ తగిన మోతాదులో అందాలతో కనువిందు చేస్తూ ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఫ్యాన్స్ నుసంపాదించుకున్న రష్మీ గౌతమ్ అప్పుడప్పుడు సినిమాలలో కూడా తన సత్తా చాటుతుంది . ప్రస్తుతం నందుతో కలిసి బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే సినిమా చేస్తోంది. రష్మీ, నందు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి కారణం నందు మాసీ లుక్ లో కనిపించడమే..

రష్మీ గౌతమ్ కూడా రాగ్డ్ లుక్ లో కనిపించడం , పాటలు, మాటలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి.  ఇక ఇప్పటివరకు వదిలిన టీజర్ పాటలన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. నవంబర్ 4వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు.  కానీ రష్మీ మాత్రం సహకరించడం లేదట .. ప్రమోషన్లకు రావడంలేదని .. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని..  నందు అలాగే కిరీటి సినిమా డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ గీతామాధురి , యాంకర్ జబర్దస్త్ రష్మీ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకవైపు నందు అతడి భార్య గీతామాధురి,  ఇటు రష్మీ కాంట్రవర్సీ పోస్టులు పెట్టుకుంటున్నారు. నందు అయితే ఏకంగా రష్మీ మా ఫోన్లు ఎత్తడం లేదు.. ఇప్పటికే 32 సార్లు ఫోన్ చేసామని ఆయన మండిపడ్డాడు. అయితే ఇదంతా కూడా సినిమా ప్రమోషన్ లో భాగమే అని అర్థమవుతుంది . అయితే చివరకు అంతా కలిసి బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమాను ప్రమోట్ చేశారు. ప్రస్తుతం ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: