అయితే ఈ ప్రోమోలో సుధీర్ కనిపించి అందరికీ షాక్ ఇవ్వడమే కాదు సుధీర్ రావడం చూసి రష్మీ ఏడ్చేయడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమో ఇప్పుడు తాజాగా వైరల్ అవుతుంది ఉండడం గమనార్హం.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ త్వరలోనే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే అయితే ఎప్పుడు ఇంట్రెస్ట్ ఇస్తాడన్న విషయం మాత్రం క్లారిటీగా చెప్పలేదు కానీ ఎట్టకేలకు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి వచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసాడు. దీంతో ఆయన అభిమానుల సైతం ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు తోటి నటీనటులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రోమో మొదటి నుంచి చివరి వరకు ఎంత ఆసక్తిగా సాగింది, ఈ ప్రోమోలో సుధీర్, రాంప్రసాదల సందడి వేరే లెవెల్ అనిపించింది. ఈ క్రమంలో కొంతమంది సుదీర్ పై సెటైర్లు కూడా వేశారు. ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్ మదర్స్ డాటర్స్ అనే కాన్సెప్ట్ లో అమ్మలకు కూతుర్లకు పోటీలు జరిగాయి. బుల్లితెర బ్యూటీలు భాను , వర్షాలు తమ డాన్స్ తో అదరగొట్టేశారు. మరి భాను శ్రీ తన పాటతో అందరిని కన్నీరు పెట్టించింది. మొత్తానికైతే సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ గా మారింది.