కార్తీకదీపం సీరియల్ కు కొన్నేళ్ల నుంచి మంచి క్రేజీ ఉంది. ముఖ్యంగా ఇందులో దీప, మౌనిత, కార్తీక్ అనే మూడు పాత్రల చుట్టూ ఈ కార్తీక దీపం సీరియల్ తిరుగుతూనే ఉంటుంది. దాదాపుగా కార్తీకదీపం సీరియల్ 1500కు ఎపిసోడ్లకు పైగా కొనసాగింది. గత ఏడాది కార్తీకదీపం సీరియల్ ముగింపు తీసుకువచ్చారు. అయితే దీంతో ఒక్కసారిగా అభిమానులు నిరాశ పడడంతో వారికోసం కార్తీకదీపం-2 తీసుకువచ్చారు.. దీనిని నవవసంతం అనే పేరుతో ప్రసారం చేస్తున్నారు. డాక్టర్ బాబు, వంట లెక్క పాత్రలను నిరూపమ్ పరిటాల ప్రేమి విశ్వనాథ్ పోషించారు.


అయితే మౌనిత పాత్ర మాత్రం ఇందులో కనిపించలేదు. శోభ శెట్టి నటించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు బుల్లితెర వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం నిరూపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ ఇద్దరు కూడా భారీగానే నవవసంతం సీరియల్ కి చార్జ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిరూపమ్ పరిటాల కార్తీకదీపం -2 కి రోజుకి రూ. 30 వేల నుంచి 40 వేలు చార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక సీరియల్ నటుడికే ఇంత మొత్తంలో ఇవ్వడం అంటే అది సామాన్య విషయం కాదు.


వంటలక్క పాత్ర కోసం ప్రేమి విశ్వనాథ్ కూడా సుమారుగా రూ .30 వేలకు పైగా చార్జ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో వీరిద్దరి హవాని ఎక్కువగా నడుస్తోందని అందుకే వీరు ఇంత ఛార్జ్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మొదటివారం పూర్తి చేసుకున్న కార్తీకదీపం-2 సీరియల్ డిఆర్పి రేటింగ్ లో కూడా రఫ్ ఆడిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా రాబోయే కాలంలో ఈ సీరియల్ అన్ని సీరియల్ కూడా వెనక్కి నెట్టి మరి నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్లడం ఖాయమని పలువురు అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయమైతే వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: