ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా తన కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కేవలం రూ.108కే 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను అందించనుంది. అయితే భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ప్రస్తుతం కేరళ, తమిళనాడు సర్కిళ్లలో మాత్రమే 108 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ను అందిస్తోంది. త్వరలోనే మిగతా సర్కిళ్లలో కూడా ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ ప్లాన్ ప్రయోజనాల విషయానికొస్తే ఈ ప్లాన్ రోజుకు 1జీబీ డేటాను అందిస్తుంది. కాల్స్ విషయానికి వస్తే ఎయిర్ టెల్, వొడాఫోన్ తరహాలో అన్ లిమిటెడ్ కాలింగ్ ను ఇందులో అందించడం లేదు. ఈ రీఛార్జిని ఎంచుకునే కొత్త బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ రోజుకు 250 నిమిషాలు క్యాప్డ్, 28 రోజుల కాల వ్యవధికి గాను 500 ఎస్ఎంఎస్ల ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు బీఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే ఆఫర్ ను కూడా అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును ఇప్పుడు 71 రోజుల పాటు పెంచుతూ వెసులుబాటు కల్పించింది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ సాధారణంగా 365 రోజుల చెల్లుబాటు ఉంది. అయితే ఈ ఆఫర్తో ప్లాన్ చెల్లుబాటు కాలం 436 రోజుల వరకూ ఎక్స్టెండ్ అయ్యింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్, 3జీబి రోజువారీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.