మీరు తక్కువ ధరకే కొత్త స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చెయ్యాలనుకుంటున్నారా...? అయితే మీకు ఓ శుభవార్త.  తాజాగా  జియోనీ ఎఫ్8 నియోని ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది.  ఈ స్మార్ట్ ఫోన్ ని  అతి తక్కువ ధరలో తీసుకొచ్చారు. అలానే  కొన్ని ఫీచర్లని మాత్రమే ఈ  స్మార్ట్ ఫోన్ ని తీసుకు రావడం జరిగింది.  మరి ఫోన్ వివరాల్లోకి వెళితే......  ఇందులో 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 18:9గా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.

ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే.... కేవలం 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌ను మాత్రమే అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. అలానే దీని ర్యామ్ సామర్థ్యం 2 జీబీగా ఉంది. ఇది ఇలా ఉండగా ధర విషయం లోకి వస్తే.....  దీని ధర రూ.5,499గా ఉంది. తక్కువ ధరలో కొనుగోలు చెయ్యాలనుకుంటే ఇదే బెస్ట్. ఇక రంగుల విషయానికి వస్తే...... బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.  సేల్ త్వరలోనే మనదేశంలో ప్రారంభం కానుంది.  ఇందులో ఉన్న జెమ్ ఎడ్జ్ డిజైన్ ఫోన్‌కు కొత్త తరహా లుక్‌ను అందిస్తుంది. అయితే ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించలేదు.  

ఈ స్మార్ట్ ఫోన్‌ కెమెరా విషయానికి వస్తే....  వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ముందు వైపు 5 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటు లో ఉంది. అలానే రెండు వైపులా ఎల్ఈడీ ఫ్లాష్‌ను కంపెనీ అందించింది. బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 3000 ఎంఏహెచ్‌గా ఉంది.  4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో-యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా అందుబాటులో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: