దేశంలోని దిగ్గజ టెలికామ్ సంస్థలలో అధిక యూజర్లన కలిగి ఉండి మొదటి స్థానంలో ముందుకు దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో మాత్రమే అని చెప్పవచ్చు. 2022 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని కస్టమర్లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించడం జరిగింది. టెల్కో లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ తో వస్తున్న రూ.2545 ప్లాన్ పై తాజాగా మరో 29 రోజులు పాటు అదనపు సర్వీస్ వ్యాలిడిటీ ని జోడించడం జరిగింది. ఇప్పటివరకు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పై మూడు వందల ముప్పై ఆరు రోజుల పాటు అందుబాటులో ఉండగా ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ కింద 29 రూపాయల పాటు ఎటువంటి ఖర్చు లేకుండా ఇలా ప్రవర్తించటం గమనార్హం. ఇక 336 రోజులకు బదులుగా 365 రోజుల పాటు ఈ ప్లాన్ మనకు వర్కౌట్ అవుతుంది. ఇది న్యూ ఇయర్ ఆఫర్ కాబట్టి కేవలం పరిమిత రోజులవరకే అందుబాటులో ఉండడం గమనార్హం.


కాకపోతే ఈ ఆఫర్ 2022 జనవరి 2వ తేదీ వరకు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది అని స్పష్టం చేసింది రిలయన్స్ జియో. ఇరవై తొమ్మిది రోజుల అదనపు వాలిడిటీ తో పాటు రిలయన్స్ జియో నుండి ఒక సంవత్సరం పూర్తి సేవలను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రతిరోజు 1.5 జీబీ డేటా తో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు ప్రయోజనాలను మనకు రూ.2545 ప్లాన్ అందిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రీపెయిడ్ ప్లాన్ లో దీర్ఘకాలిక రీఛార్జ్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి ఈ ప్లాన్ ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇక 365 రోజుల తో పాటు ప్రతి రోజూ 1.5 జీబీ డేటా అంటే ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి.

ఇక పోతే జియో అందిస్తున్న ఈ ప్లాన్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి.. జియో కస్టమర్  లు తప్పకుండా ఈ  ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు అని పిలుపునిస్తోంది రిలయన్స్ జియో.

మరింత సమాచారం తెలుసుకోండి: