ల్యాప్ టాప్ కొనాలనుకునే వారికి యాపిల్ మ్యాక్ బుక్ సరైన ఎంపికగా ఉంటుంది.. కానీ ధర మరియు ఇతర కారణాలవల్ల యాపిల్ ల్యాప్ టాప్ కొనుగోలు చేయలేకపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు యాపిల్ సంస్థ తక్కువ ధరకే ల్యాప్ టాప్ ను లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తాజా నివేదికలు సైతం తెలియజేస్తున్నాయి.. అయితే తక్కువ ధరలలో లభించే యాపిల్ ల్యాప్ టాప్ గూగుల్ యొక్క క్రోమ్ బుక్ మరియు కొన్ని విండోస్ ల్యాప్ టాప్ లకు పోటీగా తీసుకురావడానికి టెక్ దిగ్గజ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ల్యాప్ టాప్ 2024 ద్వితీయార్థంలో ప్రకటించబోతున్నట్లు సమాచారం..యాపిల్ ఇప్పటికే దాదాపుగా రూ.80,000 అంతకంటే ఎక్కువ ధర కలిగిన ల్యాప్ టాప్ లనే విక్రయిస్తోంది. ఈ కొత్త మ్యాక్ బుక్ అత్యంత సరసమైన ధరను కలిగి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ల్యాప్ టాప్  ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ వంటి వాటిలలో పరిశీలిస్తే ఎక్కువ భాగం రూ.30,000 సెగ్మెంట్ ధరల్లో కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.. దీన్ని బట్టి చూస్తే యాపిల్ కూడా తన తక్కువ ధర కలిగి ఉండే మ్యాక్ బుక్ ను తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ఈ క్రోమ్ బుక్ లో తక్కువ బడ్జెట్లో కలిగి ఉన్నాయి కనుక విద్యా లేదా ఇతర సాధారణ ప్రయోజనాల కోసం ఈ ల్యాప్ టాప్స్ అందరికీ చాలా అనుగుణంగా ఉంటుంది. అయితే నివేదిక కచ్చితంగా వెల్లడించలేదు.. గతంలో ఐఫోన్ SE సిరీస్ ఆపిల్ తన మొట్టమొదటి తక్కువ ధర కలిగిన ఐఫోన్ను ప్రారంభించింది.. ఈ విషయం విన్నప్పుడు అందరికీ కూడా అందుబాటులో ఉంటుందన్నారు.. కానీ రూ.39,000 రూపాయలకు చేయబడింది. దీన్ని బట్టి చూస్తే యాపిల్ ల్యాప్ టాప్ కూడ చౌక ధరకు లభించే అవకాశం లేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ యాపిల్ నిజంగానే చౌకైన ధరకే లాప్టాప్ అందిస్తే ఉత్పత్తి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: