మాంసాహార వంటకాలు సర్వ్ చేసే రెస్టారెంట్లతో మాంసాహార ప్రియులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్కలు, కాకులు, పిల్లులు ఇలా చెప్పుకుంటూ పోతే తమకు కనిపించిన ప్రతి జంతువును చంపేసి వాటిని మటన్, చికెన్ మాంసం అంటూ అమ్మేసే రెస్టారెంట్ నిర్వాహకులు ఎందరో ఉన్నారు. కుళ్ళిన మాంసాన్ని వేడిచేసి కస్టమర్లకు సర్వ్ చేసే రెస్టారెంట్ల భాగోతాలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి. నూటికి  60% శాతం మంది రెస్టారెంట్ నిర్వాహకులు తమ కస్టమర్లను దారుణంగా మోసం చేస్తూనే ఉంటారు.

అయితే నైజీరియాలో ఒక రెస్టారెంట్ నిర్వాహకులు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డారు. ఆగ్నేయ నైజీరియాలోని అనాంబ్రాలోని రెస్టారెంట్ నిర్వాహకులు తమ కస్టమర్లకు తెలియకుండా తాజా నర మాంసాన్ని వడ్డించారు. అది చాలదన్నట్టు ఈ రెస్టారెంట్ నిర్వాహకులు మనిషి శరీరంలోని ఒక్కో ముక్కను 4 డాలర్ల చొప్పున విక్రయించారు.

అయితే కొందరు కస్టమర్లకు డౌట్ రావడంతో ఫలానా హోటల్ లో ఫుడ్డు అస్సలు బాగోలేదు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు హోటల్ పై రైడ్ చేసి అతి భయంకరమైన నిజాలు తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులు ఆ రెస్టారెంట్ కిచెన్ లోకి వెళ్ళగానే తాజాగా కట్ చేసిన మనుషుల తలలు ఉడికించడానికి రెడీగా ఉన్నాయి. ఆ తలల నుంచి రక్తం ఏరులై పారుతూ ఉందట. అప్పటికప్పుడే మనుషులను చంపేసి ఫ్రెష్ హ్యూమన్ మాంసంతో వంటకాలు ప్రిపేర్ చేస్తున్న అక్కడి దృశ్యాలు పోలీసులను భయబ్రాంతులకు గురి చేశాయట.

ఇక ఆ తర్వాత తేరుకొన్న పోలీసులు 11 మంది రెస్టారెంట్ సిబ్బందిని కటకటాల పాలు చేశారు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా మనిషి మాంసాన్ని అమ్మిన రెస్టారెంట్ బహుశా ఇదేనేమో. ఏదిఏమైనా ఈ రెస్టారెంట్ నిర్వాహకుల దురాశ, వికృత బుద్ధి కారణంగా కస్టమర్లు తమకు తెలియకుండానే నరమాంసభక్షకులు అయ్యారు.  అయితే అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కూడా మానవుల మాంసాన్ని అమ్ముతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: