‘ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?’ అంటూ ఆయన అభిమానులు ఆ ఫోటోని తెగ షేర్లు చేస్తున్నారు. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలు ఫాలో అయిన వాళ్లకు ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈమె ఎవ్వరో ఇట్టే అర్ధమైపోతుంది. ఆమె మరెవరో కాదు నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని. ముందస్తు ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుండీ ఈమె పోటీ చేసింది. ఫలితం సంగతి పక్కన పెడితే.. తమ్ముడు తారక్ అంటే ఈమెకు చాలా ఇష్టం.
వారి అనుబంధం ఎలాంటిదో ఈ ఫోటో స్పష్టంచేస్తోంది. ఎన్టీఆర్ తన ప్రతీ సినిమాని విడుదలకు ముందు సుహాసినికి చూపిస్తాడట. ఈమె సలహాలు, సూచనలు కూడా తీసుకుంటాడట. ప్రతీ ఏడాది రాఖీ పండుగ రోజున.. తారక్ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సుహాసిని ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుంటాడట. తమ్ముడుకి కుదరని పక్షంలో సుహాసినినే స్వయంగా సెట్స్ కి వెళ్లి మరీ తారక్ కు రాఖీ కట్టి వస్తుందని తెలుస్తుంది.ఇక ఎన్టీఆర్ "ఆర్. ఆర్. ఆర్" తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో "అయినను హస్తిన పోవలె" అనే సినిమా చేస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి