ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షోలో ప్రేక్షకులకు శనివారం ఎపిసోడ్‌ విందు భోజనంగా మారిందనే చెప్పాలి. చాలా స్టైలిష్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి ఇరగదీసాడు. ఇక అంతేగాక తను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన వీడియో ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ షో తారల తళుకుబెళుకులతో చాలా రచ్చగా మారిందనే చెప్పాలి.అలాగే ఇంటి సభ్యుల ప్రవర్తన తీరుపై నాగార్జున తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది.ఇంటిలోని పరిస్థితులపై అసహనం వ్యక్తం చేస్తూ తన కోపాన్ని తెలియజేస్తూ ఇంటి సభ్యులకు తమ తప్పులు తెలిసేలా చేసి క్షమాపణలు చెప్పించాడు.ఇక ముఖ్యంగా ఆకట్టుకునే హైలెట్ ఏంటంటే..బిగ్‌బాస్ వేదికపై రాంచరణ్ ఎంట్రీ అనే చెప్పాలి. మెగా పవర్ స్టార్ ఎంట్రీ అదిరిపోయింది.రచ్చ సినిమాలోని హీజ్ ద మిస్టర్.. తీస్ మార్కాన్ అంటూ పాటపై మెగా పవర్ స్టార్ చాలా స్టైల్‌గా నడుచుకొంటూ వచ్చాడు. అలా స్టైల్‌గా రాగానే అంతే స్టైల్‌తో నాగార్జున ఆయనను ఆహ్వానించి ఆప్యాయంగా కౌంగిలించుకున్నాడు.

ఇక రాంచరణ్‌ను వేదికపైన చూడగానే అందరూ కూడా కేరింతలు కొడుతూ హాయ్ చెప్పడం జరిగింది.ఇక దాంతో నేను వస్తే మీరు లేచి నిలబడలేదు.కానీ రాంచరణ్ వస్తే మాత్రం లేచి నిలబడ్డారు.ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొంటాను అంటూ కామెంట్ చేశాడు.ఇక బిగ్ బాస్ ఇంటి సభ్యులతో రాంచరణ్ మాట్లాడుతూ.. నేను ఈ రోజు లోబోలాగా తయారై వచ్చిన అని అనగానే ఇక లోబో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే భూమిపైన పడుకొని తలను నేలకు ఆనించి మరి నమస్కారం చేశాడు. దాంతో రాంచరణ్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యాడు.ఇక చివర్లో రాంచరణ్‌ను చూసి యాక్టర్ ప్రియ బాగా ఎక్సైట్ అయిపోయింది. సార్ లోపలికి పంపించండి సార్ అని నాగార్జునని అడిగింది. ఇంటి లోపల రెండు వారాలు ఉంచేద్దామా అని నాగార్జున అనగానే రెండు వారాలు చాలా హ్యాపీగా ఉంచేసుకొంటాం అని ప్రియ అనగానే.. రాంచరణ్ అమ్మ బాబోయ్ అనే విధంగా తన ఫేస్ పెట్టాడు.అలాగే రామ్ చరణ్ నితిన్ నటించిన మాస్ట్రో టీం ని ఇన్వైట్ చేశాడు. నితిన్, తమన్నా నభా హాజరవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: