దేశం లో కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఒక్క సారిగా షాకైన జనాలు ఆ తరువాత అసలువిషయం తెలిసి ఊపిరిపీల్చుకున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా చదువుకునే విద్యార్థిని చేసిన పని అందరిని విస్మయానికి గురిచేసింది. చదువుకునే అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుందని అంత అనుకున్నారు కానీ ఆమె ముందుచూపుని అర్ధం చేసుకున్న పోలీసులు కేవలం మందలించి వదిలిపెట్టారు. తాజాగా ఈ ఘటన మధ్యప్రదేశ్ జబల్పూర్ లో చోటు చేసుకుంది. ఆమె ఇంజినీరింగ్ చదువుతున్న 20 ఏళ్ళ విద్యార్థిని. ప్రతి రోజు ఇంటినుండి కాలేజీకి వెళ్లి  ఇంజినీరింగ్ క్లాస్లను పూర్తి చేసుకుని ఇంటికి  చేరేది. గత సోమవారం పోలీసులు బస్టాండ్ వద్ద అనుమానంగా కనిపించిన ఆమెను పట్టుకుని తనిఖీ చేశారు .



ఆ బీటెక్ చదువుతున్న ఆ విద్యార్థిని బ్యాగ్ ని చెక్ చేసినప్పుడు ఆమె బ్యాగ్ లో ఉన్న ఓ పదునైన చైనా కత్తిని చూసి వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు . అదుపులో తీసుకున్న ఆమెను విచారించారు పోలీసులు . ఈ విచారణలో భాగంగా ఆ విద్యార్థిని పలు ఆసక్తికర విషయాలను పోలీసులకు వివరించింది. జబల్ పూర్ లో బీటెక్ చదువుతున్న ఒక స్టూడెంట్ బ్యాగులో చైనా లో తయారైన ఓ కత్తి కనిపించడంతో పోలీసులు ఒక్క సారిగా అప్రమత్తమయ్యారు . వెంటనే ఆ విద్యార్థిని ని అదుపులోకి తీసుకున్నారు . 



ఆమె ఆ పదునైన కత్తిని ఆన్లైన్ లో చైనా వర్తకుని దగ్గర కొనుగోలు చేసినట్లు ఆ యువతీ పొలిసు అధికారులకు తెలిపింది. అలంటి పదునైన కత్తిని తాను మాత్రమే కాకుండా ఆమె కాలేజీలో ఉన్న అందరు అమ్మాయిలు ఆన్లైన్ ద్వారా  కొన్నట్లు ఆమె వివరించింది. ఆ కత్తులు కేవలం వారి ఆత్మరక్షణ కోసం కొనుగోలు చేశామని అని ఆమె తెలియజేసింది . కేవలం భద్రత కోసమే ఆ కత్తులను కొన్నట్లు ఆమె తెలిపింది .

విద్యార్థినీలు కాలేజీకి వచ్చి వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న మాండ్వా బస్తి రౌడీలు మూకలు తమను ఇబ్బంది పెట్టేవారని తెలిపింది. వారినుండి రక్షించుకోవడానికి మాత్రమే వారు ఆ కత్తులను కొనుగోలు చేసినట్లు ఆమె పోలీసుల విచారణలో తెలిపింది . అయితే ప్రాణహాని కలిగించే ఆయుధాలు కలిగివుందన్న  కారణం చేత ఆ స్టూడెంట్ ని అరెస్ట్ చేశారు . తరువాత ఆమె తల్లితండ్రులను పిలిపించి ఆమెకు బెయిల్ పై విడుదల చేసారు . అయితే ఆ యువతీ తో పటు ఆ కత్తులను కొన్న ఇతర విద్యార్థినుల కోసం పొలిసు లు గాలిస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: