ముసలి వాళ్లు సైతం ఇక ఈ పాట వింటే లేచి డాన్సులు చేస్తున్నారు అంటే ఈ పాట ఎంత ఉర్రూతలూగిస్తుంది అన్నది అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక ఎంతోమంది నాటు నాటు పాట పై డాన్స్ చేస్తూ ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండటం గమనార్హం.ఇక ఇలా సోషల్ మీడియాలో కి వచ్చిన పోస్టులపై అటు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం కూడా స్పందిస్తూ ఉంది. ఇక ఇటీవలే నాటు నాటు పాటపై ఏకంగా క్రికెటర్లు డాన్సులు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే ఈ పాట పై నేరుగా
క్రికెటర్లు డాన్స్ చేయలేదు లెండి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్పింగ్ చేసి ఆ స్థానంలో బట్లర్, యశ్వస్వి ఫోటోలు పెట్టి రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రబృందం కూడా స్పందించింది. మీ హాస్య పూరిత పోస్ట్లు అంటే మాకు ఎంతో ఇష్టం అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రబృందం స్పందించింది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎప్పుడు సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు పెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.