టెక్నాలజీ మారిపోతుంది. మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పటి మూఢనమ్మకాలను కట్టుబాట్లను మనిషి అక్కడే వదిలేసి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే మనుషుల్లో నేటి రోజుల్లో ఎక్కడ చూసినా పరిపక్వత కనిపిస్తుంది. కానీ అటు అధునాతన జీవనశైలి లోకి అడుగుపెడుతున్న మనిషిలో మానవత్వం మాత్రం పూర్తిగా కనుమరుగై పోతుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే నేటి రోజుల్లో ఎక్కడ చూసినా కనీసం జాలి దయ లేకుండా ఎంతో కర్కశంగా ప్రవర్తిస్తున్న మనుషులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సాటి మనుషుల విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా దారుణంగా ప్రవర్తిస్తూ ప్రాణాలను తీసేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 చాక్లెట్ తిన్నంత ఈజీ గా మనిషి ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నారు. సొంత వారు పరాయి వాళ్ళు అనే తేడా లేకుండా ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటున్నారు ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులు. అయితే మనుషులను మాత్రమే కాదు మూగజీవాలను సైతం వదిలి పెట్టడం లేదు అని చెప్పాలి. ఇటీవలి కాలంలో కొంతమంది మానవమృగాలు గా మారిపోయి మూగజీవాల పై అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రక్తం పీల్చే రాక్షసులుగా మారి పోయి మూగజీవాలను అత్యంత కారణంగా హతమారుస్తూ ఉండడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి.



 మనుషుల్లో మానవత్వం పూర్తిగా కనుమరుగై పోయింది అన్నదానికి ఇక్కడ జరిగిన ఘటన కూడా నిదర్శనంగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా పీకల దాకా తాగిన ముగ్గురు యువకులు మూగ జీవి అయినా కోతిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో దెబ్బలకు తట్టుకోలేక కోతి చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆమెథి లో వెలుగులోకి వచ్చింది. ఇలా కోతి ని కొట్టి చంపిన వీడియో ని ఏకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసిన పోలీసులు ముగ్గురు యువకులను కూడా అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: