![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/viral/127/viral-01af30a5-5b99-481e-9ae8-0dfba6d5c4ba-415x250.jpg)
అయితే నేటి రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం మొత్తం పాకిపోయిన నేపథ్యంలో ఇలాంటి వింతైన ఘటన ఎక్కడైనా జరిగింది అంటే చాలు అది ఇంటర్నెట్ లోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వాలిపోతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో గడ్డం పెంచుకోవడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఎంతోమంది యువకులు తమకు నచ్చినట్లుగా బార్బర్ షాప్ కు వెళ్లి గడ్డం షేప్ చేయించుకోవడం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇలా గడ్డం చేయించుకోవడమే సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది.
అదేంటి ఇక అందరూ ఎప్పుడు ఏదో ఒకసారి గడ్డం చేయించుకుంటూనే ఉంటారు. అందులో సంచలనం ఏముంది అని అనుకుంటున్నారు కదా.. అయితే అబ్బాయిలు గడ్డం చేయించుకుంటే పర్వాలేదు. కానీ ఇక్కడ ఒక అమ్మాయి బార్బర్ షాప్ కు వెళ్లి గడ్డం చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఎంతో రద్దీగా ఉన్న బార్బర్ షాప్ కు వెళ్లిన 18 ఏళ్ళ యువతి ఏకంగా గడ్డం గీయించుకుంది. ఈ క్రమంలోనే మగవారికి గడ్డం గీయించినట్లుగానే ఫేస్ కి క్రీమ్ పెట్టి ఇక బ్లేడ్ తో గడ్డం క్లీన్ చేశాడు బార్బర్. ఇక ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయినా అమ్మాయిలు గడ్డం చేయించుకోవడం ఏంటి పైత్యం కాకపోతే అంటూ కామెంట్ చేస్తున్నారు.