నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ఎలా అయితే పరిమితికి మించి నిద్రించకూడదో, అదే విధంగా తక్కువ నిద్రపోయినా ఆరోగ్య  సమస్యలు తప్పవు. ప్రతి మనిషికి రోజుకు 8 గంటల నిద్ర అవసరం. లేదంటే అనవసరంగా అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. అయితే ఈరోజు మనం మహిళలు తక్కువ నిద్రపోవడం వలన కలిగే ఆరోగ్యం సమస్యల గురించి మాట్లాడుకుందాం.  చాలా మంది మహిళలు ఇంటా బయట పని చేయడం వలన వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తిరీత్యా బయట ఎన్నో పనులతో సతమతమయ్యి తిరిగి ఇంటికి వచ్చాక కుటుంబ బాధ్యతలన్నీ చక్కబెట్టే టప్పటికి బాగా ఆలస్యం అవుతూ ఉంటుంది. దాంతో చాలా మంది మహిళలు లేట్ నైట్ నిద్రపోతుంటారు. మళ్ళీ ఉదయాన్నే యధావిధిగా లేచి ఇంట్లో పనులను చూసుకొని తిరిగి తమ ఉద్యోగాలకు వెళుతుంటారు. ఇలా నిత్యం జరుగుతూ ఉండటం వలన...నిద్రలేమి కారణంగా మహిళలు తరచూ వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. 

అలాగే స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ సైంటిస్టులు ఓ అధ్యయనం ద్వారా తెలియచేశారు.

* అవసరానికి మించి తక్కువ నిద్రిస్తున్న మహిళల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని..తద్వారా మాటిమాటికీ చిరాకు పడటం, అసహనం, కోపం వంటి లక్షణాలు, భావాలు ఎక్కువగా కనబరుస్తున్నారు అని చెబుతున్నారు. వీటి వలన బిపి ఎక్కువయ్యే సమస్య ఉంది.

* రాత్రి సమయంలో  7 గంటలు పాటు నిద్ర పోతున్నామని చెప్పిన   మహిళలతో పోలిస్తే 5 గంటలకంటే తక్కువ సమయం నిద్రిస్తున్న వారిలో బీఎండీ( ఎముకలో ఖనిజ సాంద్రత )
తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. తద్వారా ఎముకలు త్వరగా బలహీన పడిపోతాయని అంటున్నారు.

* నిద్రను నిర్లక్ష్యం చేయడం వలన రోగ నిరోధక సమస్యలు వస్తాయని తద్వారా తరచూ ఇన్ఫెక్షన్ల భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

*  నిద్ర అనగా మన శరీరానికి విశ్రాంతి ఇవ్వడం.. రోజంతా పనిచేస్తూ తిరిగే మనం కనీసం 7 గంటలైనా నిద్రపోవాలి. లేదంటే ఆ ప్రభావం మెదడుపై పడుతుంది.  శరీరంలో ఏ పని జరగాలన్నా మానిటర్ చేసేది మన మెదడే. అందుకే, రాత్రివేళలో మెదడుకు  విశ్రాంతి అత్యంత అవసరం.

ఈ విశ్రాంతి సమయంలో మెదడు వ్యర్థాలను బయటకు పంపుతుంది అలాగే కాస్త విరామం తీసుకుంటుంది అప్పుడే ఆరోగ్యానికి మంచిది. కాబట్టి  రోజూ రాత్రిపూట నిద్ర 8 గంటల సేపు మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది...

మరింత సమాచారం తెలుసుకోండి: