ఆటో మొబైల్ కంపెనీ కార్లు సరి కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి..పండగ సీజన్లలో మొదలైన ఆఫర్లను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.. డిస్కౌంట్లు కొనుగోలు దారులకు అందుబాటులో ఉండటంతో వాటిని ఎక్కువగా కొంటున్నారు. ఒక్కో సంస్థ ఒక్కో కారుపై భారీ తగ్గింపు ధరను ప్రకటించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, డాట్సన్, మరిన్ని సంస్థలు రాయితీలు ప్రకటించాయి. కరోనా కారణంగా అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆటోమొబైల్ సంస్థలు గత కొన్ని రోజులుగా మళ్లీ కోలుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ కార్లపై జిగేల్ మనే ఆఫర్లను అందిస్తున్నారు. అవేంటో చూడండి..
టయోటా కూడా మెగా కార్నివాల్ను ప్రకటించింది. ఈ నెల 13 వరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో అందుబాటులో ఉండనున్న ఈ కార్నివాల్లో రూ.45 వేల వరకు ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు అందించనుంది.ఇన్నోవాపై రూ.40 వేల వరకు తగ్గింపును ప్రకటించింది.ఇకపోతే కారు కొన్న నాలుగు నెలల తర్వాత ఈఎంఐ కట్టే వీలును కల్పించింది. మొత్తానికి ఈ కారు కొనుగోలు పై 45 వేల వరకు భారీ తగ్గింపును పొందవచ్చు..
టాటా మోటర్స్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించింది..ఎంపిక చేసిన మోడళ్ళపై ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. వీటి వల్ల వాహనాన్ని కొన్న వారు లబ్ది పొందవచ్చునని పేర్కొంది..టియాగోపై రూ.15 వేల రాయితీని ఇస్తున్నది. దీంట్లో ఎక్సేంజ్ బోనస్ రూ.10 వేలు అందిస్తున్నది. ఇకపోతే హారియర్పై రూ.40 వేల వరకు భారీ ఆఫర్ ను అందిస్తుంది..
మారుతి సుజుకీ కంపెనీ కార్ల పై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది..ఎస్-ప్రెస్సో, సెలెరియో, సియాజ్, ఎస్-క్రాస్ మోడళ్ళు ఉన్నాయి. ఈ కార్ల పై భారీ ఆఫర్లను అందిస్తున్నారు.. ఈ కంపెనీ నుంచి వచ్చిన కార్ల పై ఎస్-ప్రెస్సో,సెలెరియో,సెడాన్ కారైన సియాజ్ కార్ల పై దాదాపు 50 వేల వరకు ఆఫర్ ను పొందవచ్చు...