బ్రిటన్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమ సరికొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీని ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది.ఇక ఇండియాలో ఈ లగ్జరీ ఎస్‌యూవీ ప్రారంభ ధరను రూ.64.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.ఇండియాలో కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ బుకింగ్స్‌ను ఆన్‌లైన్‌లో ప్రారంభించినట్లు ఆ కంపెనీ తెలిపడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కార్ డెలివరీలు కూడా ప్రారంభం అవుతాయని జాగ్వార్ కంపెనీ ల్యాండ్ రోవర్ తెలిపింది.ఇక ఈ సరికొత్త మోడల్ ఎవోక్ ఎస్‌యూవీ కార్ రేంజ్ రోవర్ లగ్జరీ బ్రాండ్ సూపర్ డిజైన్ డీటేలింగ్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అలాగే మోడ్రన్ లగ్జరీ ఇంటీరియర్ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ తెలపడం జరిగింది.ఇక ఈ కారు గురించి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి మాట్లాడుతూ.. రేంజ్ రోవర్ ఎవోక్ తన ప్రత్యేకమైన ఇంకా సరి కొత్త స్మార్ట్ డిజైన్‌తో ఎల్లప్పుడూ తలలు తిప్పుకునేలా చేస్తుందని చెప్పారు.

ఇక ఈ కారులో కొత్త ఇంటీరియర్ డిజైన్ తో పాటు ఇంకా సరికొత్త ల్యాండ్ రోవర్ టెక్నాలజీలు అలాగే శక్తివంతమైన ఇంజన్లను ప్రవేశపెట్టడంతో పాటు మునుపటి కన్నా మరింత శక్తివంతంగా అలాగే ఇంకా సమర్థవంతంగా ఉంటుందని అన్నారు.ఇక ఈ సరికొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఆర్-డైనమిక్ ఎస్ యు వి వేరియంట్ (ఇంజినియం 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్) ఇంకా ఎస్ వేరియంట్ (2.0 లీటర్ డీజిల్ ఇంజన్) ఆప్షన్లలో లభిస్తుంది. ఇండియాలో ఈ సరికొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ధర ఎక్స్-షోరూమ్ ధర వచ్చేసి రూ.64.12 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది.ఇక ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కార్ లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎక్కువగా 184 కిలోవాట్ శక్తిని ఇంకా 365 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. అలాగే, ఈ కార్ లోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 150 కిలోవాట్ల శక్తిని అలాగే 430 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: