ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కు ముందున్న ఛార్జీలను అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి అనవసర ప్రయాణాలను తగ్గించడానికి  పెంచిన చార్జీలను కూడా తగ్గించనున్నారు. తక్షణమే పాత చార్జీలు  అమల్లోకి వస్తాయని వెల్లడించారు. మరోవైపు కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను నడిపిన రైల్వే శాఖ రైల్వే నెంబర్లకు ముందు సున్నా ఉండేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆ సున్నా లను దశలవారీగా తీసేస్తూ వారంలోపు పూర్తిస్థాయిలో సాధారణ రైళ్లు నడవనున్నాయి. ఇకపై రెగ్యులర్ ట్రైన్స్ మాదిరిగానే నడుస్తాయని రైల్వే బోర్డు తెలిపింది. దింతో ఈ ట్రైన్స్ లో టికెట్ ధరలు తగ్గాయి. కోవిడ్ ఉదృతి కారణంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇండియన్ రైల్వేస్ టికెట్ ధరలు పెంచింది. అధిక టికెట్ ధరలతో స్పెషల్ ట్రైన్స్ ని నడిపింది. అయితే ఇప్పుడు స్పెషల్ ట్రైన్స్ ట్యాగ్ ఉండదు. సాధారణ రైల్వే ఛార్జీలతో పోలిస్తే స్పెషల్ ట్రైన్స్ చార్జీలు 30 శాతం అదనంగా వసూలు చేసేవారు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చాలా రోజుల డిమాండ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కరోనా తగ్గిన నేపథ్యంలో సాధారణ రైళ్లను ప్రారంభిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఇది వర్తిస్తుందని అయితే పండగపూట నడిచే ప్రత్యేక రైళ్లకు మాత్రం ఈ సవరణ వర్తించదని స్పష్టం చేసింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం సాధారణ సంఖ్యలతో సంబంధిత ప్రయాణ తరగతులకు రైళ్లకు వర్తించే ఛార్జీలతో నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజుల్లో పాత రైల్వే నెంబర్లుగా మారతాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, స్పెషల్ క్లాస్ ట్రైన్ ప్రయాణికులకు కరోనా ముందున్న మాదిరిగానే చార్జీలను రాయితీలు పునరుద్ధరించనున్నట్లు కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రత్యేక రైళ్లు సాధారణ రైళ్లు గా పట్టాలెక్కి చేస్తుండడం శుభపరిణామం.

మరింత సమాచారం తెలుసుకోండి: