దేశంలో ఈ మద్య కరోనా తో చాలా మంది భయంతో ఎక్కడికీ పోలేని పరిస్తితి నెలకొంది.  కొంత మంది క్వారంటైన్ లో ఉంటూ ఉన్మాదులుగా మారిపోతున్నారు.  ఇక కొంత మంది ప్రేమలో ఓడిపోయిన వారు.. జీవితంలో ఓడిపోయిన వారు మెంటల్ టార్చర్ తో డిప్రేషన్ లోకి వెళ్లి ఉన్మాదులుగా మారుతున్నారు. తాజాగా కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి దక్కలేదని ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్రియురాలి కుటుంబంపై రాళ్లదాడికి దిగాడు.

 

సింధనూర్ చెందిన మంజుల, మౌనేష్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్లుగా అతని ప్రవర్తన నచ్చక దూరంగా ఉంటుంది. అయితే మంజులకు ఇటీవల మరో వ్యక్తితో వివాహం జరిగింది.  ఇక సింధనూర్ లోని సూకల పేటలో భర్త అత్తమామలతో కలసి ఉంటోంది మంజుల. ఈ దాడిలో మంజులతో పాటు ఆమె భర్త, అత్తమామలు అక్కడికక్కడే మృతి చెందారు.

 

60ఏళ్ల వీరప్ప అనే వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: