గుజరాత్, అసోం రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. గుజరాత్​లోని రాజ్‌కోట్‌లో భూకంపలేఖినిపై తీవ్రత 4.5గా నమోదైంది. అసోం కరింగంజ్​లో 4.1 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది.

 

భూప్రకంపనలు వలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం  జరిగిందా అనే సమాచారం రెండు రాష్ట్రాల అధికారుల దగ్గర నుంచి  ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: