గుజరాత్, అసోం రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. గుజరాత్లోని రాజ్కోట్లో భూకంపలేఖినిపై తీవ్రత 4.5గా నమోదైంది. అసోం కరింగంజ్లో 4.1 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది.
భూప్రకంపనలు వలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందా అనే సమాచారం రెండు రాష్ట్రాల అధికారుల దగ్గర నుంచి ఇంకా తెలియాల్సి ఉంది.