అనంతపురంలో తమ ఇళ్ల పై రాళ్ల దాడి జరుగుతోంది అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న కొంతమంది టిడిపి నేతల ఇళ్లపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. అది కూడా అర్ధరాత్రి పూట అంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో చేసేదేమీ లేక సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు నేతలు. ఆ కెమెరాల ద్వారా ఇప్పుడు ఆ రాళ్లదాడి వెనుక ఉన్న బాగోతం బయట పడింది. బుధవారం రాత్రి 10.37 గంటల సమయంలో నగర తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పుట్లూరు నారాయణ స్వామి ఇంటిపై ఎప్పటిలాగే రాళ్ల దాడి జరిగింది. సీసీ టీవీ ఫుటేజ్ లో చూస్తే అది చేస్తోంది ఎవరో కాదు వైసీపీ కార్యకర్తలు అని తేలిందట. రాళ్ల దాడిలో 36వ సచివాలయం వాలంటీర్ అబ్బాస్ పాల్గొన్నారు సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇంకేముంది సీసీ టీవీ కెమెరాలు వైసీపీ నేతల గుట్టు రట్టు చేశాయి. దీనిని బేస్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: