పోలవరంకు కేంద్ర ప్రభుత్వం ఏమీ బాకీలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అంటున్నారు. జగన్ ప్రభుత్వం పోలవరం నిర్మించలేక చేతులెత్తేస్తే తాము పూర్తి చేయటానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కమీషన్ల కోసం తామే నిర్మిస్తామని చెప్పటం వల్లనే పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించిందని సోము వీర్రాజు అన్నారు.


అప్పట్లో సీఎం చంద్రబాబు శక్తిసామర్థ్యాలు చూసి ప్రాజక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఆరు వేల రూపాయల అడ్వాన్స్ కేంద్ర ఇవ్వదని, చేసిన పనులను పరిశీలించాకే నిధులిస్తారు తప్ప, ముందుగా చెల్లింపులు ఎవరూ చేయరని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. అమలాపురంలో పంట సెలవు ప్రకటించటానికి కారణం రైతులకు మద్ధతు ధర, పంట నష్టపరిహారం ఇవ్వకపోవటమేనని సోము వీర్రాజు విమర్శించారు. సెప్టెంబర్ 22 నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై జన జాగృతి యాత్రలు నిర్వహిస్తున్నట్లు సోము వీర్రాజు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: