వసంత ఋతువు తరలివచ్చింది... ఎటు చూసిన పూలసోయగాలు కనువిందు చేస్తాయి. పుష్పాలంకరణ ప్రియులకు వసంతం నిజంగా... ఓవరం అయితే, ఎంత అందమైన పుష్పాలంకరణ చేసినప్పటికీ... కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఫలితం ఉండదు. త్వరగా పూవులు పాడైపోతాయి. అందుకే ఈ చిన్నిచిట్కాలు పాటించండి.
- ముందుగా మీరు అలంకరణ కోసం ఉపయోగించే పాత్ర ప్లవర్ వేజ్ లాంటివి నూటికి నూరుపాళ్లు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి.
-మొద్దు కత్తెరల వల్ల పూవులు, ఆకులను తీరుగా కత్తిరించలేం. అందుకే వాటికి సానపెట్టించి ఎప్పుడూ బాగా పదునుగా ఉండేలా చూడండి.
-పాత్రలో నీరు పోసిన తర్వాత అడుగున ఆకులు... రెమ్మల్లాంటివి మిగిలిపోయి ఉంటే తొలగించండి.
- పాత్రలో నీరు పోసిన తర్వాత అడుగున ఆకులు... రెమ్మల్లాంటివి మిగిలిపోయి ఉంటే తొలగించండి.
- బాగా బరువైన పుష్పాలను చక్కగా అమరినట్లుగా ఉంచాలంటే సన్నటి వైరుతో వాటికి సపోర్టు ఇవ్వాలి.
- పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత పోసే నీరు మరీ చల్లగానో... వేడిగానో ఉండకూడదు.
మరింత సమాచారం తెలుసుకోండి: