ఎలాంటి మచ్చ లేకుండా ముఖం వైట్ గా, బ్రైట్ గా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. కానీ అలాంటి చర్మాన్ని కేవలం చాలా తక్కువ మంది మాత్రమే కలిగి ఉంటారు.ఇక మీరు కూడా అలాంటి వైట్ స్కిన్ ను పొందాలనుకుంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ నైట్ క్రీమ్ ను ట్రై చెయ్యండి. ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ నైట్ క్రీమ్‌ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు,రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి రెండు సార్లు వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఆపై ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి.ఇక మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు ఇంకా బియ్యాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను వేరు చేసుకోవాలి.


ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగు ఇంకా వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి అన్నీ బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.దాదాపు ఒక 5 నిమిషాలు కలిపితే ఇక మన క్రీమ్ రెడీ అవుతుంది. ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే దాన్ని వారం రోజుల పాటు వాడుకోవచ్చు.రాత్రి నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో వాష్ చేసుకుని తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇక క్రీమ్ అప్లై చేశాక రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుని నిద్రపోవాలి.ఇక నిత్యం మీరు ఈ క్రీమ్ ను వాడితే ఖచ్చితంగా మీ చర్మం పై పేరుకుపోయిన మృతకణాలు అన్ని చాలా ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అలాగే ముఖం పై ఉండే మొండి మచ్చలు కూడా ఈజీగా మాయం అవుతాయి. అలాగే మీ స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎర్ర కందిపప్పు, బియ్యం, పెరుగు ఇంకా గ్లిజరిన్ మీ చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మారుస్తాయి. అలాగే మీ ముఖాన్ని కూడా అందంగా మెరిపిస్తాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. ఎలాంటి మచ్చ లేని అందమైన ముఖం మీ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: