మనలో చాలామంది కూడా ముఖం బాగా అందంగా మెరవడం కోసం ఎక్కువగా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే అలా బ్యూటీ పార్లల్ల చుట్టూ తిరగడం వల్ల ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి తప్ప ఎలాంటి ఫలితం ఉండదు.బియ్యం పిండిని మన చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.బియ్యం పిండిలో ఉన్న లక్షణాలు చర్మం మీద మురికిని, దుమ్ము, ధూళిని చాలా ఈజీగా తొలగించి ముఖాన్ని తెల్లగా ఎలాంటి మచ్చలు లేకుండా కాంతివంతంగా మారుస్తుంది. బొప్పాయి, బియ్యం పిండి కలిపి చేసిన ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది.అలాగే బొప్పాయి తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి చర్మం మీద ఉన్న మృతకణాలను ఈజీగా తొలగించి చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. అలాగే ముఖం మీద మురికి,దుమ్ము,ధూళిని తొలగిస్తుంది.ఇది నల్లని మచ్చలను తొలగించి స్కిన్ టోన్ మెరుగుపడేలాగా చేస్తుంది. బొప్పాయి పండులో పాపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ అవాంఛిత జుట్టును తొలగించటానికి ఎంతగానో సహాయపడుతుంది.


బొప్పాయిలో మినరల్స్, విటమిన్ లు ఎక్కువగా ఉండటం వలన చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే పొటాషియం చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది.హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి బొప్పాయి చర్మాన్ని కాపాడుతుంది. బొప్పాయి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.ఒక బొప్పాయి పండును తీసుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల బొప్పాయి పేస్టు, ఒక స్పూన్ బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్, మొటిమలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.ఇలా బ్యూటీ పార్లర్ కి వెళ్ళకుండా మన ఇంటిలో ఉండే సహజ సిద్దమైన బొప్పాయి పండుతో చాలా సులభంగా మెరిసే అందమైన ముఖాన్ని ఈజీగా సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని ట్రై చెయ్యండి. ముఖంపై ఉన్న మొటిమలు మచ్చలను చాలా ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: