విజయవాడలో ఆర్మీ ఆఫీసర్ పేరుతో ఘరానా మోసం జరిగింది. వాహనం అమ్ముతామని చెప్తూ మోసం చేసారు. ప్రముఖ సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకాలు జరిపే ఓఎల్ఎక్స్ లో వాహనం అమ్ముతాను అంటూ ఆర్మీ అధికారి పేరుతో ఒక ప్రకటన ఇచ్చారు. నకిలీ ఐడి కార్డులు, వాహన పత్రాలు చూపించారు. 

 

దానిని నమ్మి ఆన్లైన్ లో 30 వేలు చెల్లించారు. ఆ తర్వాత డబ్బు తీసుకుని కనపడకుండా పోయారు. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మధ్య ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాజస్థాన్ లోని జైపూర్ కి సమీపంలో ఉన్న ఒక గ్రామ ప్రజలు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు వారిని వెతికి పట్టుకునే పనిలో బెజవాడ పోలీసులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: