హైదరాబాద్ లో లాక్ డౌన్ కారణంగా అంతా సైలెంట్ గా ఉన్న సమయంలో ఒక ఘటన అలజడి రేపింది. హైదరాబాద్ లో ఒక అమెరికన్ జాతీయుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఒక అమెరికన్ సైక్లింగ్ కోసం బయటకు వెళ్ళాడు. 

 

గండిపేట రిజర్వాయర్ వద్ద అతను అనుమానాస్పద స్థితిలో సైకిల్ మీద పడి మరణించి ఉండటం చూసారు అక్కడి వారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. అతను సైకిల్ మీద నుంచి రాయి మీద పడి ప్రాణాలు కోల్పోయాడు అని అనుమానిస్తున్నారు. దీనిపై విచారణను వేగవంతం చేసి అతని వివరాలను కనుక్కొనే పనిలో ఉన్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: