తెలుగు చిత్ర పరిశ్రమ లో  సినిమాటోగ్రాఫర్ గా చోటా కె నాయుడు కి ఎంతో గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సినిమాటోగ్రాఫర్ లు  ఉన్నప్పటికీ చోటా కె నాయుడు మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు. చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సినిమాలకు పని చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ సినిమాటోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు శ్యామ్.కె.నాయుడు. పోకిరి బిజినెస్ మాన్ గంగతో రాంబాబు లాంటి స్టార్ హీరోల సినిమాలకు  కూడా సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు శాంతి నాయుడు. 

 

 అయితే టాలీవుడ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ ఆయన శ్యామ్.కె.నాయుడు పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ సినీ నటి సాయి సుధా శ్యామ్ కె.నాయుడు ఫై పిర్యాదు  చేసింది. కాగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్యామ్ కె.నాయుడు అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: