తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు ప్రజలను తెలంగాణా కీర్తిని ఆయన కొనియాడుతూ ఒక ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ని ఆయన తెలుగులో చేయడం విశేషం. “తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

 

యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: