ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. కేటిఆర్ పై కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణలపై ఆయన స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాళేశ్వరం కమీషన్ల కోసమే కడితే ఆ నాడు సాగర్ ని కూడా కమీషన్ల కోసమే కట్టారా అని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రతిపక్ష నాయకులు మీడియాలో కాదు ప్రజల్లో ఉండాలి అన్నారు. 

 

అందరూ ఏపీ సిఎం జగన్ మాదిరిగా జనాల్లో ఉండాలి అని అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. మీడియాలో విమర్శలు చేసే వారికి క్రెడిబిలిటి ఉండాలన్నారు ఆయన. కేటిఆర్ ని విమర్శించే హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు పోసాని. మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షించరు అంటూ పోసాని వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: