ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్  ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. కరోనా  వైరస్ మూలంగా దోస్త్ నోటిఫికేషన్ ఆలస్యమైనప్పటికీ... తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే జూలై 1 నుంచి 14వ తేదీ వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్స్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

 

 అంతేకాకుండా జూలై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల  కేటాయింపు ఉంటుందని.... ఆ తర్వాత జూలై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అంటూ  తెలిపింది . జూలై 23 నుంచి 29 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని... జూలై 23 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నమోదు, ఆగస్ట్ 7న రెండవ విడత సీట్ల కేటాయింపు కొనసాగుతోంది.  తర్వాత ఆగస్టు 8 నుంచి 13వ తేదీ వరకు మూడో విడత రిజిస్ట్రేషన్ కూడా కొనసాగింది. దోస్త్ నోటిఫికేషన్ విడుదల కావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: