ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న రఘురామ కృష్ణం రాజు ఇప్పుడు ఢిల్లీ లో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ తో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయన నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్ళగా కేంద్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శిని కలిసారు. ఆ తర్వాత ఎన్నికల కమీషనర్ ని కలిసారు. 

 

అలాగే స్పీకర్ ఓం బిర్లాతో పాటుగా మరికొందరిని కలిసారు. నేడు ఆయన రక్షణ మంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఢిల్లీ పర్యటనలో ఇంకెంత మందిని కలుస్తారో అంటూ వైసీపీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇక ఆయన చేసిన షోకాజ్ నోటీసు ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించి లేఖ రూపంలో ఫిర్యాదు చెయ్యాలని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: