తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఉల్లి మార్కెట్ లో స్థానిక స్థానికేతర హమాలీల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి హాట్ హాట్ గా  మారిపోయింది. రాజమండ్రికి చెందిన జట్టు కూలీలు వచ్చి ఎగుమతులు దిగుమతులు చేయడానికి స్థానిక కూలీలు  అడ్డుకోవడంతో... ఇరు జట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 


 ఆ తర్వాత తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి యూనియన్ నాయకులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: