సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు కేసులో సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని చోటాకె నాయుడు సోదరుడు శ్యామ్ కె నాయుడు పై గతంలో సినీనటీ శ్రీసుధ  ఫిర్యాదు చేసింది. కాంప్రమైజ్ అయినట్లు నకిలీ డాక్యుమెంట్లు , చెక్కులు , డీడీలు రూపంలో 50 లక్షలు ఇచ్చినట్లు కోర్ట్ కి సమర్పించారు శ్యామ్ కె నాయుడు. డాక్యుమెంట్లు చూసి శ్యామ్ కె నాయుడుకి నాంపల్లి సెషన్ కోర్ట్  బెయిల్ ఇచ్చింది.

బెయిల్ రద్దు చేయాలంటూ సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ లో సినీ నటి  శ్రీసుధ పిటీషన్ వేసారు. సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసిన తరువాత తనను  చంపడానికి కుట్ర చేసి , విజయవాడ లో కారు ఆక్సిడెంట్ చేశారంటూ కోర్టుకి శ్రీసుధ  వివరించారు. ఈ కేసులో శ్యామ్ కె నాయుడు తో పాటు ఆయన సోదరుడు చోటకే నాయుడు కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు ఆమె ఆరోపించింది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి , శ్యామ్ కె నాయుడు కు సుప్రీం కోర్ట్  నోటీసులు ఇచ్చింది. నెలరోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: