తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ నేత‌ల‌తో జూమ్ స‌మావేశం నిర్వ‌హించారు. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ద్య జ‌రుగుతున్న నీటి వివాదంపై నేత‌ల‌తో ప్ర‌ధానంగా చ‌ర్చింస్తున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నీటి పంప‌కాలు,వివాదాలు, ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న సంగ‌మేశ్వ‌ర ప్రాజెక్టుపై బండి సంజ‌య్ నేత‌ల‌తో చ‌ర్చించారు.నీటి పంప‌కాల విష‌యంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను బీజేపీ త‌ప్పుప‌డుతుంది.కృష్ణాజ‌లాల వివాదంపై బీజేపీ భ‌విష్య‌త్ కార్యచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.గ‌త వారం రోజులుగా ఏపీ,తెలంగాణ ప్ర‌భుత్వాల మ‌ధ్య వాట‌ర్ వార్ న‌డుస్తుంది. ఏపీ ప్ర‌భుత్వం అక్ర‌మంగా రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం నిర్మిస్తుందంటూ తెలంగాణ ప్ర‌భుత్వం ఆరోపిస్తుంది. ఏపీ ప్ర‌భుత్వం తెలంగాణ నీటిని దొంగ‌లించుకుపోతుంద‌ని టీఆర్ఎస్ మంత్రులు ఆరోపిస్తున్నారు.ఇటు తెలంగాణ ప్ర‌భుత్వం సాగ‌ర్‌లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌డాన్ని నిలిపివేయాలంటూ ఏపీ అధికారులు సాగ‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌గా వారిని అడ్డుకున్నారు.రోజురోజుకి ఈ వివాదం ముదిరిపోవ‌డంతో బీజేపీ కూడా దీనిపై ఫోక‌స్ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: