ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు కాస్త ప్రజలకు దగ్గరయ్యే విధంగా కష్టపడుతున్నారు. రాజకీయంగా తీవ్ర స్థాయిలో పోలీసులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా టీడీపీ జగన్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసే క్రమంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. డయల్ యువర్ ఎస్పీ ను ప్రారంభించిన గుంటూరు రూరల్ ఎస్పీ జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ప్రతి బుధవారం ఉదయం 11 - 12 గంటల మద్య లో ఫోన్ చేయవచ్చు అని తాజాగా ఒక ప్రకటన చేసారు.

బాధితులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ కార్యక్రమం అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం యధాతధం అని వృద్దులు, మహిళల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం అన్నారు ఆయన. గంట పాటు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఫోన్ ద్వారా గ్రీవెన్స్ వింటాం అన్నారు ఆయన. సుదూర ప్రాంతాల నుండి రాలేని వాళ్ళకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ఉపయోగపడుతుంది అని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: