ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. ప్రముఖ పంచాంగ కర్తగా పేరున్న ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందారు. ఆయనకు ప్రముఖ జ్యోతిష పండితుడుగా కూడా మంచి పేరు ఉంది. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు వచ్చిన  ములుగు రామలింగేశ్వర సిద్ధాంతిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను యశోద ఆసుపత్రికి తరలించారు.


ఇంట్లో ఉన్నప్పుడు మొదట ఆయాసం వచ్చిందని.. ఆ తర్వాత దాన్ని గుండెపోటుగా గుర్తించి కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన చికిత్స పొందతూ మరణించారు.  ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండెపోటుతోనే చనిపోయినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతికి జ్యోతిష్యులుగా మంచి పేరు ఉంది. ఆయన ఎన్నో జరగబోయే విషయాలను ముందే ఊహించి చెప్పారు. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి సేవలందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: