ఐఫోన్‌ అంటే అందరికీ మక్కువే.. కానీ అలాంటి ఐఫోన్ చవకగా వస్తుందంటేనే ఆలోచించాలి. ఇలా వస్తుందంటే.. అది చోరీ సొమ్మయినా కావాలి.. లేకుంటే స్మగుల్డ్ గూడ్ అయినా కావాలి. అలా ఖరీదైన యాపిల్‌ ఫోన్లను అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ముఠాను తాజాగా అనంతపురం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి కోటి రూపాయలకి పైగా విలువైన 64 ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


ఐఫోన్లతో పాటు మొత్తం 203 సెల్‌ఫోన్లు ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు మరో 50వేలు క్యాష్ కూడా ఈ ముఠా దగ్గర దొరికింది. అనంతపురం జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి, విజయవాడకు చెందిన రాజేశ్‌ ఓ దుకాణంలో ఎలాంటి బిల్లులు లేకుండానే ఫోన్లను అమ్ముతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి వారిని అరెస్టు చేశారు. వీరి ఈ ఫోన్లను చెన్నైలోని అబ్దుల్, సుల్తాన్, శీతల్‌ నుంచి తెప్పించారట. వాళ్లు విదేశాల నుంచి ఐఫోన్లు అక్రమంగా తెప్పిస్తున్నారట. ఏపీలో రాజేశ్, ఆదినారాయణ రెడ్డి వివిధ ప్రాంతాలకు ఈ ఫోన్లు సప్లయ్‌ చేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: