రికార్డ్‌ స్థాయిలో రూపాయి పతనమవుతున్న సంగతి తెలిసిందే. డాలర్‌ తోమారకం విలువ 80 రూపాయలు దాటింది. దీంతో రూపాయి విలువను కాపాడే చర్యలను ఆర్బీఐ ముమ్మరం చేసింది. గత కొన్నివారాల నుంచి రికార్డ్‌ స్థాయిలో పడిపోయిన రూపాయి విలువను కాపాడేందుకు  ఆర్బీఐ నడుంబిగించింది. తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల్లో ఆరో వంతు విక్రయించేందుకు ఆర్బీఐ సిద్ధమవుతోందట.


ఈ ఒక్క ఏడాదే  రూపాయి విలువ 7శాతం క్షీణించింది. అంతేకాదు. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా 80పైగా రూపాయలకు పడిపోయింది. ఆర్బీఐ తగిన  చర్యలు చేపట్టకుంటే రూపాయి క్షీణత ఇంకా భారీగా ఉంటుంది. అయితే.. సెప్టెంబర్‌లో
642.450 బిలియన్‌ డాలర్లు ఉన్న విదేశీ మారక నిల్వలు 60 బిలియన్‌ డాలర్లు తగ్గాయని ఆర్బీఐ చెబుతోంది. అందుకు విలువ తగ్గటం ఒక కారణం. దీంతో పాటు అమెరికా డాలర్ల విక్రయం ఎక్కువ కారణం. విదేశీ మారకనిల్వలు తగ్గినా 580బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలోనే
ఐదో పెద్ద దేశంగా ఇండియా ఉందని ఆర్బీఐ చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

rbi